ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Medipalli Satyam: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య...

ABN, Publish Date - Jun 21 , 2024 | 07:47 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు

హైదరాబాద్: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 12 సంవత్సరాల క్రితం రూపదేవిని మేడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.


కొంపల్లిలోని సంవత్సర కాలంగా పేట్ బషీరాబాద్‌లోని దవేరియా విల్లాస్‌లో సత్యం దంపతులు నివాసం ఉండేవారు. నెల రోజులు క్రితమే అల్వాల్‌లోని పంచశీల కాలనీ రోడ్ నంబర్ 12 కి మారారు. సత్యం, రూపాదేవి దంపతులకు కుమారుడు యోజిత్ (11 ) , కుమార్తె రిషిక శ్రీ (9) ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో సత్యం కూడా స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సత్యంను పరామర్శించారు. రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.

Updated Date - Jun 21 , 2024 | 07:47 AM

Advertising
Advertising