CM Revanth: పోలీస్ ఫ్లాగ్ డే.. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:48 PM
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ప్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులకు సీఎం నివాళులర్పించారు.
గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే.
పోలీసు అమవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు.
అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన సీఎం.
పోలీసుల గౌరవందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
విధి నిర్వహణలో అసువులు బాసి అమరులైన పోలీసులకు నివాళులర్పించిన సీఎం.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన డీజీపీ డాక్టర్ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు.
పోలీసు అమరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబాలతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.
పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు.
Updated Date - Oct 21 , 2024 | 12:53 PM