భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం..
ABN, Publish Date - Jan 25 , 2024 | 10:29 AM
ములుగు జిల్లా: తాడ్వాయి మండలం, మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని సమ్మక్క సారక్కలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు.
వనదేవతలు సమ్మక్క సారక్కలను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యం.
మేడారంలోని భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యం.
మేడారంకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా పహరా కాస్తున్న పోలీసులు..
మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారక్కల దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడ గంటలు మోగిస్తున్న దృశ్యం.
మేడారంలో వనదేవతలు సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించుకునేందుకు బంగారం, మేకపిల్ల, వస్త్రాలు తీసుకువస్తున్న భక్తులు..
Updated Date - Jan 25 , 2024 | 10:29 AM