పశ్చిమగోదావరి జిల్లా: పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం వేదికగా బుధవారం జరిగిన విజయకేతనం జెండా సభ.. గోదావరికి వరద వస్తే ఎలా ఉంటుందో.. దాన్ని తలపించింది. లక్షలాదిగా పోటెత్తిన జనంతో సభ సూపర్ సక్సెస్ అయింది. సభ వేదికపై అగ్రనేతలు ఇద్దరూ ఒకరి జెండా ఒకరు పట్టుకుని (చంద్రబాబు జనసేన జెండా.. పవన్ కల్యాన్ తెలుగుదేశం జెండా) తమ కూటమి అంత గట్టిగా ఉందన్న సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం ఈ కూటమిదేనన్న చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న ఈ మొదటి సభ రాష్ట్రం దశ, దిశ మార్చబోతోంది.