Home » West Godavari
ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థినిని గెంటివేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు.
అన్నదాతలతో కన్నీరు పెట్టించిన దొంగల ముఠాకు నూజివీడు రూరల్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. కొన్ని నెలలుగా రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి భరతం పట్టారు. నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేపై పూనెం వంశీ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఒకసారి కలవాలని సోషల్ మీడియా ద్వారా సిద్ధాంతానికి చెందిన వీరాభిమాని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సత్యనారాయణ కోరిక మేరకు సీఎం.. ఆయనను ఆప్యాయంగా కలుసుకున్నారు.
భవిష్యత్తులో తాగు నీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న గంగంపాలెం గ్రామం సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. గత కొద్ది రోజులుగా అటవీ ప్రాంతాల నుంచి గ్రామాల వైపు వస్తున్న పెద్దపులి మూగజీవాలపై వరుసగా దాడులు చేస్తోంది.
ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
పోలవరం జిల్లా గంగవరం మండలం వేములోవ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దానిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో సంస్థాగతంగా బలోపేతం అయ్యే అంశంపై జనసేన పార్టీ దృష్టి సారించింది. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీంతో కేడర్లో జోష్ కనిపిస్తోంది.