Sri Ram Navami: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు.. పారవశ్యంలో భక్తులు..
ABN, Publish Date - Apr 17 , 2024 | 04:54 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ్ని సీతారామలక్ష్మణ ఆంజనేయులను దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ్ని సీతారామలక్ష్మణ ఆంజనేయులను దర్శించుకున్నారు.
దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రాకను ముందుగానే అంచనా వేసిన అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
భూపాలపల్లి జిల్లాలో రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకల్లో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
వరంగల్ సంగెం మండలం చింతలపల్లిలో పురోహితులు సముద్రాల సుదర్శనాచార్యులు సీతారాముల కళ్యాణం నిర్వహించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సీతారాముల కల్యాణ ఘడియల సమయంలో జై శ్రీరామ్ నినాదంతో భక్తి పారవశ్వంలో మునిగిపోయారు.
కరీంగర్ జిల్లా వ్యాప్తంగా రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడు కొలువైన తర్వాత మొదటి శ్రీరామనవమి పర్వదినం కావడంతో భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చారు.
Updated Date - Apr 17 , 2024 | 05:00 PM