నిజం గెలవాలి.. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో భువనేశ్వరి పర్యటన దృశ్యాలు..
ABN , Publish Date - Mar 27 , 2024 | 08:56 AM
ఏలూరు: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ భువనేశ్వరి ఈ యాత్ర చేస్తు్న్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు.
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు.
పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, యర్రంపేట గ్రామంలో టీడీపీ కార్యకర్త చండ్ర చినకన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.. వారికి ఆర్థిక సాయం అందజేసిన దృశ్యం.
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 21-09-2023న గుండెపోటుతో మృతిచెందిన వెంకటలక్ష్మి(50) చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నారా భువనేశ్వరి..
వెంకటలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.. వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న దృశ్యం.
పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, బయ్యనగూడెం గ్రామంలో టీడీపీ కార్యకర్త మార్గాని వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.. వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న దృశ్యం.
చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, పేరంపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్త భీమడోలు వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.. వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న దృశ్యం.
చింతలపూడి 10వ వార్డులో టీడీపీ కార్యకర్త నల్లజర్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.. టీడీపీ అండగా ఉంటుందని భరసా ఇస్తూ.. ఆర్థిక సాయం అందజేస్తున్న దృశ్యం.
Updated Date - Mar 27 , 2024 | 08:56 AM