జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనలు..
ABN, Publish Date - Jan 03 , 2024 | 01:22 PM
అనంతపురం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సీఎం, మంత్రులు, ప్రభుత్వ తీరును ఎండ కొడుతూ మున్సిపల్ ఉద్యోగులు రోడ్డుపై నాటకం ప్రదర్శించారు. మరోవైపు అనంతపురంలో జాబ్ క్యాలెండర్కు పిండం పెడుతున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులు...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యం.
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఇక తమకు ఉరే గతంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉరి వేసుకుని నిరసన తెలిపారు.
అనంతపురంలో మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై సీఎం, మంత్రులు, ప్రభుత్వ తీరును ఎండగడుతూ రోడ్డుపై నాటకం ప్రదర్శిస్తున్న మున్సిపల్ ఉద్యోగులు..
అనంతపురంలో మంచి నీళ్లు రాకపోవడంతో కుళాయిలవద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు..
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళా కార్మికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న దృశ్యం.
అనంతపురంలో జాబ్ క్యాలెండర్కు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు బ్రాహ్మణుడితో పూజలు చేయించి పిండం పెడుతున్న దృశ్యం.
జాబ్ క్యాలెండర్కు కర్మకాండ చేసిన అనంతరం వాటిని నీటిలో విడిచిపెడుతున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులు...
Updated Date - Jan 03 , 2024 | 01:22 PM