పోలీసు అమర వీరులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి..
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:12 AM
విజయవాడ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైమ్ రేట్ జీరోకు రావాలని, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట పడాలని చెప్పారు. పోలీసు అమరవీరుల స్థూపాన్ని అమరావతిలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీఎస్ నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ముఖ్య అధికారులు పాల్గొని పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న దృశ్యం..
పోలీస్ అమరవీరులకు సెల్యూట్ చేస్తున్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత.. ప్రక్కన డీజీపీ ద్వారకా తిరుమలరావు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
పోలీస్ సేవాకార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు..
Updated Date - Oct 22 , 2024 | 11:12 AM