ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabh Elections 2024: బెంగాల్‌లో రికార్డు స్థాయి పోలింగ్, తక్కిన రాష్ట్రాల్లోనూ నిలకబడగా పోలింగ్

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:48 PM

పశ్చిమబెంగాల్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ చురుకుగా సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈసీ అందజేసిన వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్‌లో రికార్డు స్థాయిలో 66.34 శాతం పోలింగ్ నమోదైంది.

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections-2024) తొలి విడత పోలింగ్ చురుకుగా సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈసీ అందజేసిన వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్‌లో రికార్డు స్థాయిలో 66.34 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో 47.44 శాతం పోలింగ్ జరిగింది. తక్కిన రాష్ట్రాల్లో పోలింగ్ చురకుగా జరుగుతోంది. 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు జరిగిన (మధ్యాహ్నం 3 గంటల వరకూ) పోలింగ్ శాతంలోకి వెళ్తే...

Lok Sabha Elections 2024: తొలి విడత పోలింగ్...మణిపూర్‌లో హింస


అసోంలో 60.70 శాతం, బీహార్‌లో 39.73, ఛత్తీస్‌గఢ్‌లో 58.14, జమ్మూకశ్మీర్‌లో 57.09, లక్షద్వీప్‌లో 43.98, మధ్యప్రదేశ్‌లో 53.40, మహారాష్ట్రలో 44.12, మణిపూర్‌లో 63.03, మేఘాలయలో 61.95, మిజోరంలో 49.77, నాగాలాండ్‌లో 52.35, పుదుచ్చేరిలో 58.86, రాజస్థాన్‌లో 41.51, సిక్కింలో 52.72, తమిళనాడులో 51.10, త్రిపురలో 68.35, ఉత్తరప్రదేశ్‌లో 47.44, ఉత్తరాఖండ్‌లో 45.62, పశ్చిమబెంగాల్‌లో 66.34 శాతం పోలింగ్ నమోదైంది.

జాతీయ వార్తలు కోసం...

Updated Date - Apr 19 , 2024 | 04:49 PM

Advertising
Advertising