Home » West Bengal
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు.
శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పర్యటనకు ఎన్నికల కమిషన్ బుధవారంనాడు బ్రేక్ వేసింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు కూచ్బెహర్లో గవర్నర్ తలపెట్టిన పర్యటనను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ మరో రెండ్రోజుల్లో ఉందనగా ఎన్నికల మేనిఫెస్టోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. తొలి దశలో కూచ్బెర్, అలిపుర్దౌర్, జలపాయ్గురిలో పోలింగ్ జరుగనుంది. టీఎంసీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలను ప్రకటించింది.
సందేశ్ఖాళిలో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి బహరాంపూర్లో నడిరోడ్డుపై తమ కార్యకర్తను నిలదీస్తూ వీరంగ సృష్టించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అధీర్ రంజన్ దౌర్జన్యాన్ని ఎండగడుతూ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
పశ్చిమ బెంగాల్లో(West Bengal) శాంతి నెలకొంటే బీజేపీ(BJP) సహించదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు.
బీజేపీ, ఎన్ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఎన్ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. సీఏఏ చట్టాన్ని కేంద్రం ఆమోదించిందని, కానీ సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే మీ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రజలను ఆమె తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.