Home » West Bengal
బెల్డంగాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కబీర్ మాట్లాడుతూ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తాను ముర్షీదాబాద్లోని రెజినగర్, బెల్డంగా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
వసంతం వచ్చేసింది.. అనే బెంగాలీ పాటతో పాపులర్ అయిన చక్రవర్తి ఆ పాటను పాడుతుండగా మాలిక్ స్టేజ్పైకి వచ్చి పెద్దగా అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించాడని తన ఫిర్యాదులో చక్రవర్తి పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో టీఎంసీ 'మహా జంగిల్ రాజ్'కు బీజేపీ చరమగీతం పాడుతుందని మోదీ అన్నారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు.
బెంగాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వర్చువల్గా ఆ కార్యక్రమానికి హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించారాయన.
అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. మొదట అతడు కోల్కతా చేరుకున్నాడు. అయితే కోల్కతాలో మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రేక్షుకులు, మెస్సీ అభిమానులు విధ్వంసానికి దిగారు.
పశ్చిమబెంగాల్లో ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్కతా స్టేడియనంలో అభిమానులు విధ్వంసం సృష్టించడంతో బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పించింది.
నిర్వహణలోపం కారణంగా గందరగోళానికి కారణమయ్యాడనే ఆరోపణపై శతద్రును హైదరాబాద్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బిధాన్నగర్ కోర్టులో హాజరు పరిచారు.
బెల్డాంగలో ప్రతిపాదిత బాబ్రీ మసీదుకు కబీర్ శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఆయన నుంచి బాబ్రీ మసీదు ప్రకటన వెలువడగానే పార్టీ నుంచి కబీర్ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది.
రెజినగర్లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి కబీర్, పలువురు ఇస్లాం మతపెద్దలు రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగినట్టు ప్రకటించారు. నారా-ఏ తక్బీర్, అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు.
బెంగాల్లో బాబ్రీ మసీదు నిర్మిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీఎమ్సీ నేత, కోల్కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ తెలిపారు.