ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: విమానాల్లో పిల్లలకు అమ్మానాన్నల పక్కనే సీటు

ABN, Publish Date - Apr 24 , 2024 | 05:04 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరేక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఆదేశాలిచ్చింది.

విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరేక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఆదేశాలిచ్చింది. 12 ఏళ్ల లోపు పిల్లలకు అదే పీఎన్‌ఆర్‌ నంబరుపై ప్రయాణించే వారి తల్లిదండ్రులు/సంరక్షకుల్లో కనీసం ఒకరి పక్కనైనా సీటు కేటాయించాలని సూచించింది. ఇందుకు సంబంధించి రికార్డులు కూడా నమోదు చేయాలని ఆదేశించింది.

పిల్లలకు తల్లిదండ్రులు/ సంరక్షకుల పక్కన సీటు ఇవ్వకపోవడంపై పలు ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. అలాగే ‘2024 ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్కూలర్‌-01’ను సవరించినట్లు తెలిపింది. దాని ప్రకారం విమానయాన సంస్థలకు జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, భోజనం/ స్నాక్స్‌ /పానియాలు వంటి సేవలపై రుసుము వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.

Updated Date - Apr 24 , 2024 | 06:17 AM

Advertising
Advertising