Amit Shah: 4న కన్నియాకుమారిలో అమిత్ షా ప్రచారం
ABN, Publish Date - Mar 29 , 2024 | 08:09 AM
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఏప్రిల్ 4వ తేదీన కన్నియాకుమారిలో పర్యటించనున్నారు. ఈస్థానం నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్ రాధాకృష్ణన్కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
చెన్నై: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఏప్రిల్ 4వ తేదీన కన్నియాకుమారిలో పర్యటించనున్నారు. ఈస్థానం నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్ రాధాకృష్ణన్కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకముందే ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంలో రెండు దఫాలుగా పర్యటించారు. ఎన్నికల నోటిఫికేషన్, రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించిన తర్వాత అమిత్షా ఈనెల 4వ తేదీన తొలిసారి పర్యటనకు రానున్నారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. 4న కన్నియాకుమారిలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్షా పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభలో కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలైతో పాటు ఆ పార్టీ నేతలు హాజరుకానున్నారు. అయితే, అమిత్ షా పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెల్లడికావాల్సి ఉంది.
Updated Date - Mar 29 , 2024 | 08:09 AM