ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Actress Khushboo: ప్రభుత్వ పదవిలో ఉన్నా.. అందుకే ప్రచారం చేయలేకపోతున్నా..

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:08 PM

కేంద్ర ప్రభుత్వ పదవిలో ఉండటం వల్లే తాను ఎన్డీయేకు మద్దతుగా బీజేపీ(BJP) అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) తెలిపారు.

చెన్నై: కేంద్ర ప్రభుత్వ పదవిలో ఉండటం వల్లే తాను ఎన్డీయేకు మద్దతుగా బీజేపీ(BJP) అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖుష్బూకు పార్టీ టిక్కెట్‌ లభించకపోవడం వల్లే ఆమె ప్రచారానికి దూరంగా ఉంటున్నారని ఇటీవల ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ప్రతి ఎన్నికల సమయంలోనూ తన గురించి వదంతులు వ్యాపించడం ఆనవాయితీగా మారిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను ప్రయత్నించలేదని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాని తెలిపారు. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ప్రభుత్వ పదవిలో ఉన్నానని, కనుకనే తాను ప్రచారానికి దూరంగా ఉంటున్నానని, అదే సమయంలో బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:08 PM

Advertising
Advertising