ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Somireddy: ఒంగోలులోనూ జగన్ అవే అబద్ధాలు చెప్పారు

ABN, Publish Date - Feb 23 , 2024 | 04:50 PM

ఒంగోలు ‘సిద్ధం’ సభలోనూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవే అబద్ధాలు చెప్పారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy ) అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2 సెంట్ల ఇంటి పట్టాను పేదలకు ఇస్తే... సెంటుకు జగన్‌రెడ్డి కుదించారని మండిపడ్డారు.

అమరావతి: ఒంగోలు ‘సిద్ధం’ సభలోనూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవే అబద్ధాలు చెప్పారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy ) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు 2 సెంట్ల ఇంటి పట్టాను పేదలకు ఇస్తే... సెంటుకు జగన్‌రెడ్డి కుదించారని మండిపడ్డారు. గృహ నిర్మాణానికి కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర నిధుల నుంచి చంద్రబాబు రూ.లక్ష ఇస్తే జగన్ రెడ్డి కేంద్ర నిధులతోనే సరిపెట్టారని అన్నారు.

57 నెలల పాలనలో 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను జగన్‌రెడ్డి కబ్జా చేశారని అన్నారు. దళితుల కోసం చంద్రబాబు భూమి కొనుగోలు పథకం పెట్టి 5 వేల ఎకరాలు ఇస్తే, జగన్‌ ఈ పథకాన్ని రద్దు చేశారని విరుచుకుపడ్డారు. గృహ నిర్మాణానికి చంద్రబాబు 2 సెంట్లు ఇస్తే, దాన్ని సెంటుకు జగన్ కుదించారని అన్నారు. సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్లు అవినీతికి జగన్ పాల్పడ్డారని ధ్వజమెత్తారు. చంద్రబాబు 2.60 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే, వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఏకిపారేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు 2 సెంట్ల ఇంటి పట్టా ఇస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 04:50 PM

Advertising
Advertising