ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

ABN, Publish Date - Jan 10 , 2024 | 09:57 PM

దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కట్టుకున్న భార్యని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై జిల్లా ఎస్పీ పి జాషువా సస్పెండ్ కొరడా ఝులిపించారు. 2018లో ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం కానిస్టేబుల్ రవి కిరణ్ మండవల్లి వెళ్లారు.

కృష్ణాజిల్లా (మచిలీపట్నం): దిశా కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కట్టుకున్న భార్యని వేధిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై జిల్లా ఎస్పీ పి జాషువా సస్పెండ్ కొరడా ఝులిపించారు. 2018లో ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం కానిస్టేబుల్ రవి కిరణ్ మండవల్లి వెళ్లారు. అదే డ్యూటీకి వెళ్లిన వీఆర్వో పూజితవిమలాదేవితో రవి కిరణ్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విమలాదేవికి అప్పటికే వివాహం కావడంతో వీరి విషయం తెలిసి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో విమలాదేవిని కానిస్టేబుల్ రవి కిరణ్ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా విమలాదేవిని మానసికంగా, శారీరకంగా రవికిరణ్ వేధిస్తున్నాడు. రవికిరణ్ వేధింపులు భరించలేక చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు కావడంతో విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ జాషువా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 09:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising