ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Brother Anil: గన్నవరం ఎయిర్‌పోర్టుకు బ్రదర్ అనిల్.. కాసేపట్లో రానున్న షర్మిల

ABN, Publish Date - Jan 03 , 2024 | 03:03 PM

Andhrapradesh: వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్రదర్ అనిల్ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్‌లో ఎస్కార్ట్ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కేసరపల్లిలో విల్లాకి బ్రదర్ అనిల్ బయలుదేరి వెళ్లనున్నారు.

విజయవాడ, జనవరి3: వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి (YSRTP Chief YS Sharmila Reddy) భర్త బ్రదర్ అనిల్ (Brother Anil) గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్రదర్ అనిల్ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్‌లో ఎస్కార్ట్ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కేసరపల్లిలో విల్లాకి బ్రదర్ అనిల్ బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద బ్రదర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ... వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినట్లు తెలిపారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు షర్మిల మాట్లాడతారని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు.


మరోవైపు.. మరికొద్ది సేపట్లోనే షర్మిల కూడా గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. నిన్న ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ సమాధిని సందర్శించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో షర్మిల ఇడుపులపాయకు వచ్చారు. ఈ సందర్భంగా కుమారుడి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాత్రి ఇడుపులపాయలోనే బస చేసిన షర్మిల ఈరోజు విజయవాడకు రానున్నారు.

కాగా.. నేటి సాయంత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల భేటీ కానున్నారనే వార్త ఏపీలో సంచలనం రేపుతోంది. వీరిద్దరి భేటిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. షర్మిళకు సాయంత్రం 4 గంటల కు కలిసేందుకు జగన్ సమయమిచ్చారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు ఇచ్చిన తరువాత.. షర్మిళ కాంగ్రెస్ లోకివెళ్లే విషయం, ప్రస్తు త రాజకీయపరిణామాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగతాయని సమాచారం. షర్మిళ రాత్రికి ఢిల్లీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 03:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising