Home » YS Sharmila
Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలో రాబోయే ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మీద ఆధార పడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎపుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్నారు. రాష్ట్ర ప్రయోజన కోసం మాత్రమే బిల్లుల విషయంలో సమర్ధించామన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి అయిదేళ్లు పూర్తి అయింది. ఆ కేసులో నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా... ఈ హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. అతడికి మళ్లీ కడప లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు..
Andhrapradesh: ‘‘రాష్ట్రానికి రాజధాని లేదు. - రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు...మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... జగన్, చంద్రబాబు, మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు.
Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతుందట..? ఇలా మాట్లాడటం సరికాదు. మతాల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య, పెండింగ్ కేస్లపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో టీడీపీ నేత బీటెక్ రవి అప్పీల్ చేశారు. అప్పీల్ను లంచ్ మోషన్ రూపంలో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు ముందుంచారు. ఈ అప్పీల్పై రేపు ఉదయం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.