Share News

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:55 PM

అనంతపురం జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ... యాత్రతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్నారు.

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

- పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

అనంతపురం: కాంగ్రెస్‌ పార్టీకి అనంతపురం జిల్లా దశాబ్దాల కాలం కంచుకోటగా ఉన్నిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) అన్నారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర కోసం ఆమె సోమవారం నుంచి బుధవారం వరకూ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాదా గాంధీ ఆధ్వర్యంలో షర్మిలను బుధవారం ఘనంగా సన్మానించారు.


zzzzzzzzzzzzzzzz.jpgతన యాత్రతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం తనకు ఉత్తేజాన్ని ఇస్తోందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాస్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే శంకర్‌, నాయకులు గాజుల వాసు, రామ్‌చరణ్‌ యాదవ్‌, ప్రసాద్‌ రెడ్డి, నరసింహా రెడ్డి, కృష్ణ, మోదిన్‌ బాషా, షఫి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్‌ పూర్తి నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2026 | 01:55 PM