ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devineni: ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీపై పోలీసులు దాడి చేయాలి

ABN, Publish Date - Apr 12 , 2024 | 08:21 AM

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌కు బదులు వైసీపీ కోడ్‌ నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) మండిపడ్డారు. అధికారులు జగన్‌కు తొత్తులుగా మారడంతో వైసీపీ గూండాలు ప్రజలు, పోలీసులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

- రాష్ట్రంలో వైసీపీ కోడ్‌.. జగన్‌కు తొత్తులుగా అధికారులు: ఉమా

అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌కు బదులు వైసీపీ కోడ్‌ నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) మండిపడ్డారు. అధికారులు జగన్‌కు తొత్తులుగా మారడంతో వైసీపీ గూండాలు ప్రజలు, పోలీసులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి నెస్ట్‌ స్పేస్‌ బిల్డింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీని నడుపుతున్నారు. అక్కడి నుంచి ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు 300 మంది ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. దీనిపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వెంటనే ఈ ఫ్యాక్టరీపై దాడి చేసి, ఫేక్‌ న్యూస్‌ని అడ్డుకోవాలి. సూత్రధారులైన సజ్జల తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం. జగన్‌, సజ్జల, ధనుంజయరెడ్డి మాటలు విని వైసీపీకి కొమ్ముకాసే అధికారులకు తగిన గుణపాఠం తప్పదు’ అని ఉమా హెచ్చరించారు.

Updated Date - Apr 12 , 2024 | 08:21 AM

Advertising
Advertising