ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దళితుల ద్రోహి.. జగన: దగ్గుబాటి

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:06 AM

దళితుల ద్రోహి సీఎం జగనమోహనరెడ్డి అని కూటమి అనంతపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్ధి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ మండిపడ్డారు.

tdp atp dagubati pracharam

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 19 : దళితుల ద్రోహి సీఎం జగనమోహనరెడ్డి అని కూటమి అనంతపురం అర్బన ఎమ్మెల్యే అభ్యర్ధి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ మండిపడ్డారు. శుక్రవారం శ్రీనగర్‌ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకున్నా రన్నారు. ఆయా వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. దళితులపై హత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. శిరోముం డనం కేసులో వైసీపీ నాయకుడు తోట త్రిమూర్తులకు కోర్డు శిక్ష విధిచిందని, అలాంటి వ్యక్తిని వైసీపీ నాయకులు కాపాడటం సిగ్గు చేటని అన్నారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైందన్నారు. ఇప్పటి దాకా రాష్ట్రంలో 6,035 మంది దళితులపై దాడులు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు తిరిగి సీఎం కావాలన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్ని వర్గాల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు లక్ష్మీనరసింహ, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు నాగార్జున, టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకులు కదిరప్ప, శ్రీనివాసులు, శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:06 AM

Advertising
Advertising