ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: అది సినిమా డైలాగ్‌లా వుంది: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-02-06T19:12:28+05:30

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బడ్జెట్‌కు విలువ లేదని, కేసీఆర్‌కు బుద్ధిలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బడ్జెట్‌కు విలువ లేదని, కేసీఆర్‌కు బుద్ధిలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. సాంబ.. రాస్కోరా.. అనే సినిమా డైలాగ్‌లా బడ్జెట్‌ ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు... అదో ఉద్యమమన్నారు. మేడారం అభివృద్ధిని సీఎం కేసీఆర్ (KCR) విస్మరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము అధికారంలోకి వస్తే మేడారం అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy Padayatra) పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం మేడారంలో ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ యాత్ర (Hath Se Hath Jodo Yatra)ను టీపీసీసీ చీఫ్ మొదలుపెట్టారు. అంతకుముందు సమ్మక్క - సారలమ్మ గద్దె (Sammakka - Saralamma Gadde)ల వద్దకు వెళ్లిన రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. మేడారం (Medaram)కు వచ్చిన రేవంత్‌కు బాణాసంచా పేల్చి, డోలువాయిద్యాలతో కాంగ్రెస్ శ్రేణులు (Congress) ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఎత్తు బంగారాన్ని రేవంత్ తులాభారం వేశారు. సమక్క - సారలమ్మ దర్శనానంతరం టీపీసీసీ చీఫ్ పాదయాత్రను మొదలుపెట్టారు.

Updated Date - 2023-02-06T19:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising