Home » Telangana Congress
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసింది. ఈ బృందంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా ఉన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో పాల్గొననున్న మీటింగ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. బయటకు వస్తే పులి సంగతి చెబుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి తప్పుచేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ తమకంటే ఎక్కువగా బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడిన ఆయన ఆ పార్టీతో చేతులు కలపడం బాధాకరమని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇందల్వాయి మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్మడి గోపీ దారుణ హత్యకు గురయ్యారు. సొంత మేనల్లుడే కారుతో గుద్ది, కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత పిటీషన్ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరకాల తమ అడ్డా... వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.