Home » Telangana Congress
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో దసరా పండుగకు చీరలు ఇస్తే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఓట్లకు చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పలు రంగుల చీరలు ఇచ్చారని... కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ హయాంలో ఇచ్చామని గుర్తుచేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.
మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశలో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్ట్ విషయంపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారని.. తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎయిర్లైన్స్ కంపెనీలతో తాము మాట్లాడుతున్నామని వివరించారు.
తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు, అలాగే మరో మూడు కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది.
హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ హితవు పలికారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరికీ వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జోరుగా ఇవాళ ప్రచారం చేయనున్నాయి.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
ఫీజు రీయింబర్స్మెంట్పై సీఎం రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలను తాను ఖండిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులు బంద్కి దిగారని గుర్తుచేశారు కవిత.