ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Praveen Kumar: రాబోయే రోజుల్లో ఫాంహౌస్‌లో నీలి జెండాలు పాతుతాం

ABN, First Publish Date - 2023-09-20T19:33:39+05:30

సిద్దిపేట(Siddipet)లో దొరల గడిలా మీద బహుజన దండయాత్ర చేస్తున్నాం... రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్‌(KCR Farmhouse)లో నీలి జెండాలు పాతుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్( Praveen Kumar) హెచ్చరించారు.

సిద్దిపేట: సిద్దిపేట(Siddipet)లో దొరల గడిలా మీద బహుజన దండయాత్ర చేస్తున్నాం... రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్‌(KCR Farmhouse)లో నీలి జెండాలు పాతుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్( Praveen Kumar) హెచ్చరించారు. బుధవారం నాడు సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బహుజన దండ యాత్ర సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీరు ఏ బంద్ ఇచ్చిన.. మా బహుజనులు మీకు బంద్ పెడతారు. కేసీఆర్ అవినీతిపై దండయాత్ర చేస్తాం. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) జైళ్లో ఉండాలి.. కానీ 100 కోట్ల ముడుపులు ఇచ్చిన కవిత ఎట్లా బయట ఉంటారు. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు. కేసీఆర్ గజ్వేల్‌(Gazwal)లో ఓడి పోతున్నారు.. అందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు..అక్కడ కూడా బహుజనులు ఉన్నారు.. కేసీఆర్ ఒడిపోతారు’’ అని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-20T19:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising