Home » Siddipet
రైతులు బాధపడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోతల సీజన్ వచ్చినప్పుడల్లా రివ్యూ మీటింగ్లు పెట్టి రైతుల అవసరాలన్నీ తీర్చేవారని గుర్తుచేశారు.
తెలంగాణ మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పొలిటికల్ స్కోరింగ్ తప్ప స్టేట్ స్కోరింగ్ లేదని విమర్శించారు.
బెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని... నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న వారిద్దరూ ఆయనతో సమావేశమయ్యారు.
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగు రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేటఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చారణా చేసి.. బారనా ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రెండున్నరేళ్లలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది.
ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకట్ స్వామి వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి గొప్ప పాత్ర పోషించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. సిధారెడ్డికి అవార్డు రావడం అంటే అవార్డుకే విలువ పెరిగిందని పేర్కొన్నారు.
రోడ్డు భద్రతపై ప్రజలకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. మనల్ని మనం కాపాడుకుందామనుకునే లోపే ప్రమాదం జరిగిపోతుందని తెలిపారు.