ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy Tweet: టీఎస్‌పీఎస్సీ కేసుపై రేవంత్ ట్వీట్.. ఎవరా ఇద్దరూ అని జోరుగా చర్చ

ABN, First Publish Date - 2023-04-01T14:48:56+05:30

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్ కేసు (TSPSC Leakage Case)లో టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ (TSPSC Secretary Anita Ramachandran), టీఎస్‌పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి (TSPSC Committee Member Lingareddy)కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ సెటైర్ విసిరారు. ‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. మీకు అర్థం అవుతుందా ‘‘పరువు’’ గల కేటీఆర్ గారూ...?’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు టీఎస్‌పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జతచేస్తూ రేవంత్ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం రేవంత్‌ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు రేవంత్ ట్వీట్‌ చేసి బావా.. బావమర్ధులు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ట్వీట్‌లో రేవంత్‌ ప్రస్తావించిన ఈ బావా బావమర్దుల్లో ఒకరు గతంలో సీఎంవోలో పనిచేసిన ఒక రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.

కాగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ కేసులో సిట్ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు నిందితులను విచారించిన సిట్‌ అధికారులు.. టీఎస్‌పీఎస్సీ సభ్యులను విచారించేందుకు సిద్ధమైంది. పలువురు టీఎస్‌పీఎస్సీ సభ్యులు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అనితను సిట్ అధికారులు విచారించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్... అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పనిచేశాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు సంబందించిన అంశాలలతో పాటు టీఎస్‌ఎస్సీలోని అడ్మినిస్ట్రేషన్, కాన్ఫిడెన్షియల్ విభాగంపై స్టేట్మెంట్‌ను సిట్ రికార్డు చేసింది. అలాగే టీఎస్‌పీఎఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్న రమేష్‌.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, లింగారెడ్డికి పీఏగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో రమేష్‌కు లింగారెడ్డికి ఉన్న సాన్నిహిత్యంపై సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే లింగారెడ్డి ఇప్పటివరకు సిట్ విచారణకు హాజరుకాలేదు. మధ్యాహ్నం తరువాత సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-04-01T14:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising