Home » Revanth
కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విందు ఇవ్వడంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయపరంగా కాకుండా పరిపాలనా అవసరాల దృష్ట్యా జరిగిందని ఆయన తెలిపారు. అనవసరంగా ట్రోల్ చేయవద్దని పేర్కొన్నారు.
దేశానికి గాంధీ, అంబేడ్కర్ రెండు కళ్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ఉందో.. దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర అంతే ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం క్యాతనపల్లిలో నీచ రాజకీయం చేశారంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం మంచిర్యాలలో జిల్లా పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో స్పందించారు. తెలంగాణ అభివృద్ధిపై మీతో చర్చకు తాను సిద్ధమని కేరళ సీఎం పినరయి విజయన్కి సీఎం రేవంత్ సవాల్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అందుకోసం అమిత్ షా నివాసానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఈనెల 8వతేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వనదేవతల దర్శనానంతరం ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ తమ ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి భూముల్లో అనేక ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే చర్యలకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి పదవి కోసం తాను ఏ రోజు పాకులాడలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి కావాలంటూ తాను ఎవరిని అడగలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినే తాను త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.