Home » Revanth
రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎక్స్ (X) వేదికగా స్పందించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సభలో రూ.2,482 కోట్లను 41.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలోని లూసియానాలో ఇటీవల మృతిచెందిన తెలంగాణ యువకుడు కె.అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తన స్నేహితులను కాపాడే ప్రయత్నంలో యువకుడు అకాలమరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని రేవంత్ పేర్కొన్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) పరిధిలో రూ.1,674.74కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మియాపూర్లో రూ.161కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లు దండుకొని ఒక్క ఎకరానికీ నీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.
హరీష్రావుతో రాజకీయంగా ప్రమాదం ఉందని కేటీఆర్ గుర్తించారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సీఎల్పీ మీడియా హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాలపై విమర్శలు గుప్పించారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదన్నారు. పది రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తానని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.