ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Jagadish Reddy: తెలంగాణపై కిషన్‌రెడ్డి, బండి సంజయ్ విషం కక్కుతున్నారు

ABN, First Publish Date - 2023-06-02T15:46:19+05:30

నాటి, నేటి అభివృద్ధి పరిస్థితులను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...ఆకలి పారద్రోలి దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు నిలిచామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: నాటి, నేటి అభివృద్ధి పరిస్థితులను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...ఆకలి పారద్రోలి దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు నిలిచామన్నారు. అభివృద్ధి చూసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రతి క్షణం తెలంగాణపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో తెలంగాణ మోడల్ పథకాలు చూపిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ అప్పులు చేసి ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అప్పులతో తాబేదార్లకు ఆస్థులు పెరిగాయని, ఇద్దరి అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వమే మాఫియా అని.. విచారణ సంస్థలను అడ్డగోలుగా ఉసిగొల్పుతున్న బీజేపీ మాఫియా ప్రభుత్వమని విమర్శించారు. బీజేపీ వైఫల్యం వల్లే దేశంలో కాంగ్రెస్ బలపడుతోందన్నారు. ప్రత్యామ్నాయం లేక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-06-02T15:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising