Home » Guntakandla Jagadish Reddy
తన ఏకైక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం మాజీ సీఎం కేసీఆర్ని జైలు పంపడమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయ్యిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ - బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని ఆరోపించారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రైవేట్ పరం చేయడంలో మొదటి మెట్టు అని చెప్పారు.
పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, అందరి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. స్ధానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశానికి చైర్ పర్సన వన్నూర్బీ అధ్యక్షత వహించారు.
యాదాద్రి విద్యుత్ ప్లాంట్ విషయంలో చేస్తున్న వాదనలో సహేతుకత లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై ఎల్ నరసింహ రెడ్డి కమిషన్ సమాచారం కోరిందని, ఈ రోజు రిప్లై పంపించినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ (BRS) బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి , డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గూడెం మహిపాల్ రెడ్డీ పార్టీ మార్పుపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డే ఇల్లు ఇల్లు తిరిగి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.
విద్యుత్ కమిషన్ నుంచి తనకు లెటర్ వచ్చిందని.. కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై తన అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు
గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఈరోజు(మంగళవారం) తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
జిల్లాలో భూకబ్జాలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి ( Jagadish Reddy) పాల్పడ్డారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) అన్నారు. సోమవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగదీష్ రెడ్డి జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారని.. పేదలను ఇబ్బందులకు గురించేశారని మండిపడ్డారు.