ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN: బేగంపేట చేరుకున్న చంద్రబాబు.. ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

ABN, First Publish Date - 2023-11-01T18:02:11+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) 52 రోజుల తర్వాత మంగళవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు.

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) 52 రోజుల తర్వాత మంగళవారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. బయటి కొచ్చిన అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన హైదరాబాద్ విచ్చేశారు. బేగంపేటలో తెలుగు తమ్ముళ్లు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌ నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో బాబుకు కంటి పరీక్షలు చేయనున్నారు. 52 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత చంద్రబాబు నాయుడు, వైద్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై నిన్న బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-01T18:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising