ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Australian Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. మరో తెలుగు ఆటగాడు కూడా..

ABN, First Publish Date - 2023-08-03T17:13:16+05:30

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో 5వ సీడ్ పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను ఓడించింది. 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌ను సింధు 21-14, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడించింది.

సిడ్నీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో 5వ సీడ్ పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను ఓడించింది. 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌ను సింధు 21-14, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో సింధు అమెరికాకు చెందిన 4వ సీడ్ బీవెన్ జాంగ్‌తో తలపడనుంది. సింధు, జాంగ్ చివరిసారిగా 2020లో తలపడ్డారు. అమెరికా షెట్లర్లపై హెడ్ టూ హెడ్ రికార్డుల్లో 6-4తో సింధు అధిక్యంలో ఉంది. కాగా వరుసగా జపాన్ ఓపెన్, కొరియా ఓపెన్‌లలో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధు ఆస్ట్రేలియా ఓపెన్‌లో రాణిస్తుండడం భారత్‌కు శుభ పరిణామంగా చెప్పుకొవచ్చు. త్వరలోనే ఆసియా గేమ్స్ జరగనున్న నేపథ్యంలో సింధు ఫామ్‌లోకి రావడం మంచి విషయమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.


ఇక మరో తెలుగు ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కూడా పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ప్రీక్వార్టర్స్‌లో 21-10, 21-17 తేడాతో చైనీస్ తైఫీ ప్లేయర్ సు లి యాంగ్‌ను ఓడించాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకోవడం కిదాంబి శ్రీకాంత్‌కు ఇది మూడో సారి. అలాగే మరో భారత ఆటగాడు ప్రియాంషు రజావత్ కూడా పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. 59 నిమిషాలపాటు సాగిన ప్రీక్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ త్జు వీనిని ప్రియాంషు ఓడించాడు. 21-8, 13-21, 21-19తో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. కాగా క్వార్టర్ ఫైనల్‌ పోరులో భారత ఆటగాళ్లైనా కిదాంబి శ్రీకాంత్, ప్రియాంషునే తలపడడం గమనార్హం. కాగా మరో భారత ఆటగాడు మిథున్ మంజునాథ్ పురుషుల సింగిల్స్‌లో మలేషియాకు చెందిన లీ జి జియాతో పోరాడి ఓడాడు. 13-21, 21-12, 19-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Updated Date - 2023-08-03T17:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising