Home » ABN Andhrajyothy Effect
తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులకు అన్నదానం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 4.4 కోట్ల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు టీటీడీ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలోని వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదని పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే ఈ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడానికి సుముఖంగా లేదన్నారు.
భారత్తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ బ్యాటర్ వింత ఔట్ అయ్యాడు. ఆఖరి వికెట్గా క్రీజులో రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బలమైన ఈదురుగాలుల ధాటికి స్టెప్స్ లాడర్ విమానాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు ఎయిర్ ఇండియా విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివరాల్లోకి వెళితే..
చైనాలోని ఒక ప్రదర్శనలో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో.. అదుపు తప్పి ఓ చిన్నారిపై దాడి చేసింది. కడుపులో బలంగా తన్నడంతో ఆ బాలుడు నొప్పితో కుప్పకూలాడు..
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు సోమవారం విజయవాడలో వెల్లడించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఇసుక ర్యాంపులపై అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ఇసుక అక్రమ దందాపై అధికారులు విచారణ చేపట్టారు.
రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహక అధికారులు (సీఈవో)గా పదోన్నతులు కల్పించింది.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ మానసిక రోగి పడుతున్న ఇబ్బందిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్కు జోనల్ కమిషనర్ స్పందించారు.