Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్..

ABN , Publish Date - Jan 25 , 2026 | 10:34 AM

గుజరాత్‌ బనాస్‌కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్..
Seven Killed In Gujarat Banas Kantha Road Accident

గాంధీనగర్, జనవరి 25: గుజరాత్‌ బనాస్‌కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమీర్‌గఢ్ తాలూకా ఇక్బాల్‌గఢ్ సమీపంలోని పాలన్‌పూర్ - అబు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.


క్షతగాత్రులను పాలన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో ఇన్నోవా కారులో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.


ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత్ సుంబే వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోపాటు.. రాంగ్ సైడ్‌లో వాహనం రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ వివరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్

నాంపల్లి అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

For More National News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 11:05 AM