Home » PV Sindhu
భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్లో పావురాల కారణంగా మ్యాచ్కు రెండుసార్లు అంతరాయం ఏర్పడటంతో.. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు.
క్రీడల్లో ప్రపంచస్థాయి సంస్థను విశాఖపట్నంలో నిర్మించడమే తన లక్ష్యమని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించారు. భారత్లో ప్రతిభకు కొదవ లేదని.. సరైన వేదికలే అవసరమని పేర్కొన్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు.
ప్రతిష్ఠాత్మక 'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్' సీడింగ్స్ విడుదలయ్యాయి. జపాన్ ఓపెన్ విజేత, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు మహిళల సింగిల్స్ విభాగంలో 9వ సీడ్గా నిలిచింది.
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు కథ ముగిసింది. స్థానిక క్రీడాకారిణి చేతుల్లో పోరాడి ఓడిన సింధు.. క్వార్టర్ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది.
జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఆమె విజయం వెనుక కఠిన సాధనతో పాటు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక సలహా కీలక పాత్ర పోషించిందని సింధు భర్త వెంకట దత్త సాయి వెల్లడించారు.
జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తెలుగు షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు.
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది. ఈ టైటిల్ అందుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన సింధు.. భావోద్వేగానికి గురైంది.
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది.