Home » PV Sindhu
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్లోనే నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీస్లో మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, జపాన్ స్టార్ అకానె యమగుచి చేతిలో సింధు పరాజయం పాలైంది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చాన్ సు యుపై సింధు విజయం సాధించింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి కాసేపు కోచ్గా మారారు. వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్ అయిన ఆయన సింధు కోసం కొద్దిసేపు కోచ్గా మారారు. అంతేకాక కోచ్గా తన భార్యకు మనోధైర్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ డ్రెయిన్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు డిప్యూటీ సీఎం వినూత్న కార్యక్రమం చేపట్టారని కొనియాడారు.
ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్ 2026 నుంచి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు నిష్క్రమించింది. చైనాతో జరిగిన కీలక పోరులో స్టార్ షట్లర్ పీవీ సింధు పరాజయం పాలైంది. గ్రూప్ ఏలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో చైనాపై 5-0 తేడాతో భారత్ భారీ ఓటమిని చవి చూసింది.
ప్రముఖ భారత బ్యాడ్మింటన్.. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు క్రీడా పాలనారంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కౌన్సిల్ సభ్యురాలిగా సింధు ఎన్నికయ్యారు.
పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులను మాత్రమే కాక, అంతర్జాతీయ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటుడు మంచు విష్ణు, పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు..
యువత క్రీడల్లో రాణించేందుకు శాప్ లీగ్ గొప్ప వేదిక అని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ వ్యాఖ్యానించారు. శాప్ లీగ్ మ్యాచ్ల ద్వారా యువతకు సువర్ణావకాశం లభిస్తుందని పేర్కొన్నారు..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. కెరీర్లో 500 మ్యాచుల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు క్రియేట్ చేసింది.