ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: బీచ్‌లో షాకింగ్ సీన్.. ఇసుకలోంచి బయటపడిన ఓ పాప కాలు.. చివరకు తేలిన నిజం ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-04-18T15:35:41+05:30

వారిద్దరూ భార్యాభర్తలు. వారికో బిడ్డ. ఊరుకాని ఊరులో నివాసం ఉంటున్నారు. రాత్రి ముగ్గురూ కలిసి ఒకే దగ్గర నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి బిడ్డ కనిపించ లేదు. చుట్టు ప్రక్కల అంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఓ వైపు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. ఇంకోవైపు పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. అసలు విషయం తెలిసి

Mother
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ భార్యాభర్తలు. వారికో బిడ్డ. ఊరుకాని ఊరులో నివాసం ఉంటున్నారు. రాత్రి ముగ్గురూ కలిసి ఒకే దగ్గర నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి బిడ్డ కనిపించ లేదు. చుట్టు ప్రక్కల అంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఓ వైపు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. ఇంకోవైపు పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. అసలేమైంది? బిడ్డ ఎలా మాయమైందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

పిల్లలు.. తల్లిదండ్రులకు దేవుడిచ్చే బహుమానం. ఏ స్త్రీకైనా జీవితంలో సంతోషం కలిగించేది ఏదైనా ఉందంటే అది మాతృత్వమే. నవమాసాలు మోసి కనడమంటే మరో జన్మ ఎత్తడమే. అంత గొప్పది మాతృత్వమంటే.

తమిళనాడు (Tamil Nadu)లోని చెన్నై (Chennai) కొరటూరులో కుమరేశన్ (32) అనే యువకుడు పుదువాయ్‌లో రోడ్డు పక్కన నివసిస్తున్నాడు. ఇతనికి రాజేశ్వరితో వివాహం కాగా వీరికి నలుగురు కుమారులు ఉన్నారు. ఇలా ఉండగా ఇతడు.. సంగీత (24) అనే మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ దంపతులిద్దరూ పుదుచ్చేరికి (Puducherry) మకాం మార్చి అక్కడ నివాసం ఉంటున్నారు. సంగీత కూడా 29 రోజుల కిందట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శనివారం రాత్రి కుమరేశన్, సంగీత ఇద్దరూ పాపతో కలిసి పడుకున్నారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో సమీపంలో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పుదుకుప్పం బీచ్ ఇసుకలో (Beach Sand) పాతిపెట్టిన ఓ చిన్నారి పాదం బయటకు కనిపించింది. కిరుమామ్ బాక్కం పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. కుమరేశన్, సంగీత దంపతులకు చూపించగా తమ బిడ్డేనని బోరున విలపించారు. తమ మామే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండొచ్చేమోనని కుమరేశన్ అనుమానం వ్యక్తం చేశాడు.

కానీ పోలీసులకు మాత్రం సంగీతపై అనుమానం వచ్చి లోతుగా విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకుంది. బిడ్డను తానే చంపినట్లు నేరాన్ని (Mother Killed Child) అంగీకరించింది. భర్త అనుమానించి ప్రతి రోజూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని.. బిడ్డ తనకే పుట్టిందా? లేదా? అంటూ ఘర్షణ పెట్టుకున్నాడని తెలిపింది. ఇంకోవైపు నెలలు నిండకుండా బిడ్డ పుట్టడంతో అనారోగ్య కారణాలతో పెంచడం కష్టమైందని.. మరోవైపు భర్తతో కూడా సమస్యలు రావడంతో చిన్నారిని తానే చంపి ఇసుకలో పాతిపెట్టినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది.

Updated Date - 2023-04-18T15:35:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising