ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YuvaGalam: 220వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2023-12-12T11:57:43+05:30

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రం 220వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.

అనకాపల్లి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 220వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట మండలం నామవరంలో లోకేష్‌ను తమలపాకు రైతులు కలిశారు. తమలపాకు తోటలకు పంట బీమా సౌకర్యం కల్పించాలని వినతి చేశారు.


లోకేష్ స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) చేతగాని పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. పంటలబీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి, కేవలం 16 మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించి నట్టేటముంచిన మోసగాడు జగన్ అని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలచిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-12-12T11:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising