ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kalva Srinivasulu: లోకేష్ పాదయాత్రపై వైసీపీ కుట్ర రాజకీయం

ABN, First Publish Date - 2023-06-02T12:49:25+05:30

ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై వైసీపీ మూకల దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై (Lokesh Yuvagalam Padayatra) వైసీపీ మూకల దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడికి సంబంధించి వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు (Former Minister Kalva Srinivasulu) మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ కుట్ర రాజకీయం చేస్తోందని విమర్శించారు. యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరులో కోడిగుడ్ల దాడి అందులో భాగమే అని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)వేల కిలోమీటర్లు స్వేచ్ఛగా పాదయాత్ర చేసిన విషయాన్ని సీఎం అయిన తర్వాత మరిచినట్లు ఉన్నారన్నారు. యువనేత లోకేష్ పాదయాత్రకు (TDP Leader Lokesh) లభిస్తున్న అపూర్వ ప్రజాస్పందనను జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ఇలాంటి చిల్లర పనులకు దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల కార్యక్రమాలకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు ఎంతమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లుతెరిచి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-02T12:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising