ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Satyagraha Deeksha: ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు ఆగ్రహం

ABN, First Publish Date - 2023-10-02T11:41:08+05:30

ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసగా ఎన్టీఆర్‌భవన్‌లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

హైదరాబాద్/అమరావతి: ఏపీ ప్రభుత్వంపై (AP Government) ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ (NTR Garndson Garapati Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు (TDP Chief Chandrababu Arrest) నిరసగా ఎన్టీఆర్‌భవన్‌లో (NTR Bhavan) చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర (Nandamuri Balakrishna Wife Vasundhara), ఎన్టీఆర్ కుటుంబసభ్యులు (NTR Family) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు కించపరిచినప్పుడు మహిళా కమిషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు గాజులు తొడుక్కుని కూర్చున్నారని విమర్శించారు. భువనేశ్వరి, బ్రహ్మణి, లోకే‌శ్‌లకు ఎన్టీఆర్ ఫ్యామిలీ అండగా ఉంటోందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తే రేపటి తరాలకు ఏం నేర్పిస్తారని నిలదీశారు. చంద్రబాబును జైల్లో పెడితే తెలుగు వారు ఊరుకోరన్నారు. చంద్రబాబు బయటకు వస్తారని రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారని గారపాటి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-02T11:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising