ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Karumuri: అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

ABN, First Publish Date - 2023-10-17T10:27:10+05:30

దసరా మహోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.

విజయవాడ: దసరా మహోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nagehswarrao) దర్శించుకున్నారు. దర్శనానంతరం కారుమూరి మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆహారం అందించే భాగ్యం సీఎం జగన్ మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు. రాష్ట్రం, దేశంలోని ప్రజలందరికీ అన్న, ఆహారాలకు లోటు లేకుండా చూడాలని అమ్మను వేడుకున్నానన్నారు. మరింత మందికి ఆహారాన్ని అందించేలా సివిల్ సప్లై శాఖ పనిచేయాలని సీఎం సూచించారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ లోటు రాకుండా చూస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ఆశీస్సులివ్వాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు, పాలకమండలికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2023-10-17T10:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising