Home » Kanaka durga temple
హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆంజనేయ స్వామికి అభిషేకాలు, నాగవల్లి దళార్చన, ఆకుపూజలు చేశారు.
విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి.
దుర్గగుడి పాలకమండలి సమావేశంలో ప్రధానంగా 37 అంశాలపై చర్చ జరిగింది. ఆలయంతో పాటు క్యూలైన్లలోనూ భక్తుల కోసం టీవీలు పెట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు.
విజయవాడ దుర్గగుడిలో హుండీ కానుకల లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. భక్తులు సమర్పించిన బంగారు వస్తువులను సిబ్బంది దారిమళ్లించే ప్రయత్నం చేసినట్లు బయటపడింది.
విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ మహిళా భక్తురాలి నుంచి రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు. మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
విజయవాడ దుర్గమ్మ గుడిలో జరిగే మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఆహ్వానం అందించారు. ఈనెల 6 నుంచి 8 వరకు దుర్గ గుడిలో కుంభాభిషేక మహోత్సవం జరగనుంది.
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా దేవాదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆన్లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది..
విజయవాడ దుర్గగుడిలో శ్రీచక్ర అర్చనలో అభిషేకానికి ఉపయోగించే పాలలో పురుగులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ అపచార ఘటనకు సంబంధించి బాధ్యులపై ఈవో శీనా నాయక్ చర్యలు తీసుకున్నారు.