ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: ఆలూరులో ముగిసి... ఆదోనిలోకి ‘యువగళం’ ప్రవేశం

ABN, First Publish Date - 2023-04-20T09:34:48+05:30

యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ దూసుకుపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatra) టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) దూసుకుపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువనేత పాదయాత్ర (YuvaGalam) కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలూరు నియోజవర్గంలో పాదయాత్ర ముగిసి ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గురువారం ఉదయం ములిగుందం క్యాంప్ సైట్ నుంచి 76వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్‌ ప్రారంభించారు. కాసేపటికే ఆలూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam) పూర్తి అయ్యింది. ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆదోని టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు స్వాగతం తెలిపారు.

పాదయాత్రలో భాగంగా ఈరోజు పెద్ద పెండేకల్‌లో స్థానికులతో మాటామంతి నిర్వహించనున్నారు. అరేకల్‌లో వాల్మీకులతో లోకేష్ సమావేశమవుతారు. ఆపై నాగలాపురంలో యువతతో ముఖాముఖీలో పాల్గొనున్నారు. సాయంత్రం నాగలాపురం క్రాస్ వద్ద కోలనాట సామాజిక వర్గీయులతో యువనేత భేటీ కానున్నారు. ఆపై కపటి క్రాస్ వద్ద స్థానికుల్‌తో మాటామంతి నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి ఆదోని విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు.

Updated Date - 2023-04-20T09:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising