ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhuma Akhilapriya: ఆ వైసీపీ ఎమ్మెల్యే చూపు టీడీపీ వైపు ఉందన్న మాజీమంత్రి అఖిలప్రియ

ABN, First Publish Date - 2023-02-02T14:44:42+05:30

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి చూపు టీడీపీ వైపు ఉందంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి (Nandyala YCP MLA Shilpa RaviChandraKishor Reddy) చూపు టీడీపీ వైపు ఉందంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Former Minister Bhuma AkhilaPriya) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే శిల్పా రవి టచ్‌లో ఉన్నారని తనకు తెలిసిందన్నారు. టీడీపీ (TDP)లో చేరేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి (YCP MLA) ఫ్లాట్‌ఫారం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు.

ఈ క్రమంలో నంద్యాల ఎమ్మెల్యే (Nandyala MLA)కు భూమా అఖిలప్రియ మరోసారి సవాల్ విసిరారు. ‘‘ఈనెల 4న ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా.. నేను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలి. 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకొని వస్తా. నేను అక్రమాలకు పాల్పడ్డానని ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి’’ అని సవాల్ విసారారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే శిల్పా రవి సతీమణి నాగినిరెడ్డి గొర్రెలు అని దురుసుగా మాట్లాడారని భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-02T14:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising