ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna: జోగి రమేష్ అనుచరుల మట్టి దోపిడీపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-04-17T16:06:39+05:30

మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) అనుచరులు చేస్తున్న మట్టి దోపిడీపై కలెక్టర్‌కు సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం స్పందన కార్యక్రమంలో

Ramakrishna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) అనుచరులు చేస్తున్న మట్టి దోపిడీపై కలెక్టర్‌కు సీపీఐ రామకృష్ణ (CPI Ramakrishna) ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం స్పందన కార్యక్రమంలో కంప్లెంట్ చేశారు. మట్టి తవ్వకాలతో యధేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని రామకృష్ణ ఆధారాలు అందజేశారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గూడూరు మండలం ముక్కొల్లు గ్రామంలో మంత్రి జోగి రమేష్ అనుచరులు మట్టి మాఫియా సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని చెప్పారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. కలెక్టర్ రాజబాబుకు అన్ని‌ విషయాలు వివరించినట్లు పేర్కొన్నారు. పంచాయతీ చెరువు గట్లు బలపరుస్తామని తీర్మానం చేసి.. గ్రామంలోని మట్టి మొత్తాన్ని మంత్రి అనుచరులు కొల్లగొడుతున్నారని తెలిపారు. కలెక్టర్ విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా మట్టి దోపిడీపై గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

Updated Date - 2023-04-17T16:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising