Home » Jogi Ramesh
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు నేతలు. నగదు, మద్యం, చీరలు, రకరకాల వస్తువులను ఇచ్చి ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్పెట్టేందుకు ఈసీ, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకునేందుకు ఈసీ, పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపట్టింది.
మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. పెదపులిపాకలో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దళితవాడలో మంత్రి జోగి కుమారుడు రాజీవ్, వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్, మరికొందరు మాట్లా డుకుంటుండగా.. వైసీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుకుంటున్నట్టు అనుమానపడి వారిపై రాజేష్ దాడి చేశాడు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్తోపాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
వైసీపీ (YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని (నిన్న)బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించి వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh)కు ఎస్ఈసీ మీనా నోటీసులు జారీ చేశారు.
మంత్రి జోగి రమేష్ ఓ జోకర్ అని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్తానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Elections 2024: అవును.. మాజీ మంత్రి కొడాలి నాని స్థానాన్ని ప్రస్తుత మంత్రి జోగి రమేష్ భర్తీ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ..? అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తాజాగా ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు.
ఇంకోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకుంటే మంత్రి జోగి రమేష్ ( Minister Jogi Ramesh ) ని తరిమి కొడతామని ఆ పార్టీ సీనియర్ నేత పోతిన వెంకట మహేష్ ( Pothina Venkata Mahesh ) హెచ్చరించారు. జోగి రమేష్ వ్యాఖ్యలపై పోతిన వెంకట మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఒక వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ సిద్ధాంతమని, లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి వాటిని సరిచేయాలని ఎన్నికల కమిషన్ను కలిసామని మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాను వైసీపీ నేతలు కలిసారు.