ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Babu: జైలు నుంచి బయటకొచ్చాక జడ శ్రావణ్‌కు చంద్రబాబు ఫోన్

ABN, First Publish Date - 2023-11-01T09:21:13+05:30

అమరావతి: జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏ అవినీతి చేయని తనను అన్యాయంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన..

అమరావతి: జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్‌కు (Jada Shravan Kumar) తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యక్తిగతంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏ అవినీతి చేయని తనను అన్యాయంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తనకు సహకరించిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే ఈరోజు తనని ప్రజలతో కలిపిందని. అందుకు సహకరించిన జై భీమ్ భారత్ పార్టీ ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అన్యాయాన్ని ఎదిరించడంలో తనకు మద్దతునివ్వాలని శ్రవణ్ కుమార్‌ను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు కోరారు. బాబు వ్యాఖ్యలపై స్పందించిన శ్రవన్ కుమార్ మాట్లాడుతూ.. వ్యక్తులు, వ్యవస్థల రాజ్యాంగ హక్కులు పరిరక్షించడంలో జై భీమ్ భారత్ పార్టీ ఎప్పటికీ సహకారంగా ఉంటుందని చెప్పారు. నిండు నూరేళ్లతో ఆరోగ్యంగా ఉంటూ చంద్రబాబు 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-01T09:21:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising