ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh YuvaGalam: ప్రొద్దుటూరులో లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు..

ABN, First Publish Date - 2023-05-31T16:29:02+05:30

ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు వైసీపీ అడ్డంకులు సృష్టించింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచ మల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) పాదయాత్రకు (YuvaGalam Padayatra) వైసీపీ (YCP) అడ్డంకులు సృష్టించింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచ మల్లు శివప్రసాద్ రెడ్డి (MLA Rachamallu Shivaprasad Reddy) ఆధ్వర్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు తొలగించారు. రెండు రోజులుగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. ఈరోజు రాత్రికి ప్రొద్దుటూరులోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం అంటూ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని విజయ కుమార్ కూడలి నుంచి రాజీవ్ కూడలి, శివాలయం సర్కిల్ వరకు భారీ ఎత్తున వైసీపీ కటౌట్లు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్లెక్సీల ఏర్పాటుకు చోటు లేకుండా వైసీపీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే లోకేష్ పాదయాత్ర వస్తున్న జనాదరణను చూసి వైసీపీ ఓర్వలేక ఇలాంటి చర్యలకు పూనుకుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీల వివాదం కొనసాగుతోంది.

Updated Date - 2023-05-31T16:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising