Home » KADAPA
ఆయన కడప జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడు. జిల్లా కాని జిల్లాకు, ఊరుకాని ఊరుకు వచ్చాడు. ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు. అయితే లీజు పొందింది ఒకచోట అయితే, తవ్వేది మరోచోట. నాడు ముఖ్య నేతకు అనుచరుడు కావడం, మైనింగ్ అధికారుల సహకారం దండిగా ఉండటంతో, వైసీపీ హయాంలో మైనింగ్ డాన్గా అవతరించాడు.
ఏడడుగులు వేసిన నాటి నుంచి కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతుల బంధం.. చివరకు మరణంలోనూ విడిపోలేదు. భర్త మృతిని చూసి తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన దువ్వూరులో చోటుచేసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివేకా కుమార్తె సునీతారెడ్డి సంచలన లేఖ రాశారు. ఏడేళ్లు దాటినా ఈ కేసు మిస్టరీ ఇంకా తేలలేదని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు నుంచి మెగా డీఎస్సీ 2025 ఆత్మ గౌరవ ర్యాలీ ప్రారంభమైంది. ఉపాధ్యాయుల హక్కు - న్యాయమైన నియామకాలకు మద్దతు అంటూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
కోట్లు విలువ చేసే భూములను వైసీపీ నేతలకు కట్టబెట్టిన కేసులో జిల్లా డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సీకే దిన్నె తహశీల్దార్గా మహేశ్వర్ రెడ్డి పనిచేశారు.
వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు మీదుగా అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.
ప్రియుడి కోసం ఓ మహిళ దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి అనంతపురం జిల్లాలోని గరుడచేడుకు వచ్చిన ఘటన వెలుగు చూసింది.
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై కడప జిల్లాలో భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి.