Home » KADAPA
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కీలన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. వివరాల్లోకి వెళితే..
కడప నగర శివారులో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడో యువకుడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కడప కేంద్రంగా సాగుతున్న ఒక భారీ ట్రావెల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రల పేరుతో అమాయక పర్యాటకులను నమ్మించి, విదేశీ గడ్డపై వారిని గాలికొదిలేసిన ఈ ఘటన బాధితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కడప జిల్లా గండికోట ఉత్సవాలు ఈ సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఈ శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కడప జిల్లాకే కాకుండా ఏపీలోనే చారిత్రకంగా ఆ కోటకు ఘన చరిత్ర ఉంది. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు గండికోట ఉత్సవాల పేరుతో సంబరాలు జరగనున్నాయి..
దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.
అన్నమయ్య జిల్లా పరిపాలనా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మార్పు ప్రజలకు అసౌకర్యంగా ఉందని న్యాయవాది బి. వెంకటనారాయణ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులకు సంబంధించి పరిహారం అక్రమార్కుల పరం అవుతోందనే విమర్శలొస్తున్నాయి. కలివికోడి ప్రాజెక్టు, తెలుగుగంగ కాల్వ పనులకు సంబంధించి వైసీపీ నాయకులు పరిహారం పోగేసుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.