Home » KADAPA
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ దగ్గర మోకరిల్లారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు(Assembly Elections) ఇవాళే చివరి రోజు కావడంతో.. చాలా మంది నేతలు ఇవాళ నామినేషన్లు వేస్తున్నారు. గురువారం నాడు పులివెందులలో(Pulivendula) వైసీపీ అభ్యర్థిగా(YSRCP Candidate) ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నామినేషన్(YS Jagan Nomination) దాఖలు చేయనున్నారు.
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి స్పందించారు. ‘‘న్యాయం కోసం ఇప్పుడు నేను ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టు కెళ్లారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులలో వైఎస్ సునీతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేడు ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దక్షణ భారతదేశంలో రెండవ అయోద్యధ్యగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పిలుస్తుంటారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
కడప: వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేకా కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి పట్టుపడుతున్నారని...
కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కొంగు చాచి అడుగుతున్న.. మీ ఆడ బిడ్డలం, న్యాయం చేయండి.. మీరే న్యాయ నిర్ణేతలు ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు బరిలో ఉన్నాడని వైఎస్ షర్మిల పులివెందుల బహిరంగ సభలో భావొద్వేగంతో మాట్లాడారు. షర్మిల పక్కన సునీత కూడా ఉన్నారు. ఆడ బిడ్డలం కొంగు చాచి అడుగుతున్నం అని కంట నీరు తెచ్చుకున్నారు. ఒక వైపు న్యాయం ఉంది. మరో వైపు ధర్మం ఉంది.. వైఎస్ఆర్ బిడ్డ కావాలో.. వివేకా హత్య కేసు నిందితుడు కావాలో తేల్చుకోవాలని సూచించారు.