ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందుకు...?

ABN, First Publish Date - 2023-11-01T18:53:34+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందకు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) అన్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు అంత భయమెందకు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) అన్నారు. బుధవారం నాడు టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ భూమ్మీద తానే అపరమేధావిని అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఫీలవుతున్నారు. నిన్న చంద్రబాబుకి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారు. కోర్టు నిబంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారు. కోర్టు నిబంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం చంద్రబాబు కోసం వచ్చేవారు. చంద్రబాబు నాయుడుని, లోకేశ్‌ని చూస్తే వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారు? లోకేశ్ ఢిల్లీ వెళ్తే వైసీపీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్‌పై బయటకొస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం సేకరించపోయారు. ఇప్పుడు మద్యంలో అక్రమాలని చంద్రబాబుపై మరో అక్రమ కేసు పెట్టారు. ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ నేతలను, కార్యకర్తలను ఏం చేయలేరు. మరో 5 నెలల తర్వాత వైసీపీ నేతలను ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2023-11-01T18:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising