Tirumala : తిరుమలలో బాగా తగ్గిన భక్తుల రద్దీ.. నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..
ABN, First Publish Date - 2023-08-02T07:35:03+05:30
తిరుమలలో నేడు (బుధవారం) భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.
Tirumala : తిరుమలలో నేడు (బుధవారం) భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 67,728 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 21,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Updated Date - 2023-08-02T07:35:03+05:30 IST