ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అసమర్థ పాలనపై టీడీపీ పోరాటానికి మద్దతు ఇవ్వండి: బొరగం శ్రీనివాసులు

ABN, First Publish Date - 2022-12-06T18:22:02+05:30

జగ్గారెడ్డి గూడెం, ఏలూరు జిల్లా : ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అసమర్థ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గారెడ్డి గూడెం, ఏలూరు జిల్లా : ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అసమర్థ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు కోరారు. నియోజకవర్గంలోని కుక్కునూరులో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజా సమస్యలను నమోదు చేసేందుకు అవసరమైన సామగ్రిని క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలకు అందజేశారు. నిరుద్యోగ సమస్య, నిత్యావసరాల ధరల పెరుగుదల, మద్యపానం, ఇసుక మాఫియా, కుంటుపడిన అభివృద్ధి.. వంటి 14 రకాల అంశాల మీద ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించాలని వారికి సూచించారు. సర్వే చేశామని తెలిసేలా అభిప్రాయం తెలిపిన వారితో 92612-92612 నెంబరుకు మిస్డ్‌కాల్‌ చేయించాలని కోరారు.

కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కుచ్చర్లపాటి అప్పలరాజు, క్లస్టర్ ఇంచార్జి కోటగిరి సత్యనారాయణ, కుక్కునూరు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పిచ్చుక రాజు, తెలుగుమహిళా మండల అధ్యక్షురాలు వనమా భాగ్యలక్ష్మి, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, నియోజకవర్గం తెలుగుయువత ఆర్గనైజింగ్ సెక్రటరీ పాదం రాము, తెలుగుయువత మండల అధ్యక్షులు అంగిరేకుల బాలాజీ, గురజాల పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T18:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising